ప్రకాశం: కనిగిరిలో శుక్రవారం ఉదయం రెవిన్యూ డే వేడుకలను ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కనిగిరి తహసీల్దార్ ఏవి రవిశంకర్ గురువారం తెలియజేశారు. ఉదయం 10:30కు ఈ వేడుకలను RDO కార్యాలయం వద్ద ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. వేడుకల్లో భాగంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులు పాల్గొంటారన్నారు.