VKB: జండూబామ్ డబ్బా గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతిచెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. దౌల్తాబాద్ (M) ఈర్లపల్లికి చెందిన ముసిరప బందెప్ప తొమ్మిది నెలల కుమార్తె జ్ఞానేశ్వరి గురువారం ఆడుకుంటూ జండూబామ్ డబ్బా మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు MBNRలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.