BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు ఇవాళ సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో వెంకటరావు వెల్లడించారు. ఈరోజు భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గిందని తెలిపారు. అందులో భాగంగా VIP దర్శనాలు రూ.1,65,000, బ్రేక్ దర్శనాలు రూ.1,23,000, ప్రసాద విక్రయాలు రూ.7,86,410, కార్ పార్కింగ్ రూ.2,25,000, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.17,39,491 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.