KMR: జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రద్ధను కేంద్రీ కరించిందని జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు అన్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో మౌలిక వసతులు, రోడ్ల అభివృద్ధి, గ్రామాలకు రహదారి కనెక్టివిటీ, అంశాలపై చర్చించినట్లు తెలిపారు.