ADB: రానున్న ఇంటర్ మీడియట్ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని DIEO గణేష్ జాధవ్ అన్నారు. బుధవారం తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని పరిశీలించి, సిలబస్ను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఆయనతో పాటు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఉదయ్ భాస్కర్, కళాశాల సిబ్బంది ఉన్నారు.