NLG: చిన్నారులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయిలోకి రావాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్లో ఉన్న చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ను శనివారం ఆయన సతీమణి గజాల అంజుమ్ అక్తర్తో కలిసి సందర్శించారు. ఆయన చిన్నారులకు ప్రేరణాత్మకమైన సందేశాన్ని ఇచ్చారు. సెంటర్ నిర్వాహకులను ఆయన అభినందించారు.