PDPL: మోడల్ స్కూల్ ప్రవేశాలకు (2026-27) దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి గడువు అని ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. కావున ఆసక్తిగల విద్యార్థులు త్వరగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. పాఠశాలలో దరఖాస్తులకు సంబంధించి హెల్ప్ లైన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.