MNCL: జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మండలాల పరిధిలోని 111 గ్రామ పంచాయతీలు, 996 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్కు అవకాశం ఉంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాసిపేట, కన్నెపల్లి మండలాల్లోని ధర్మారావుపేట, ముత్తాపూర్ సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.