NGKL: రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించాలని ఉద్దేశంతో పది జిల్లాలలో క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.