ప్రకాశం: మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు అన్నారు. గురువారం రాత్రి వేములపాడు రోడ్డు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10వేల జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధిస్తామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలు, ప్రమాదాల గురించి ఆయన వివరించారు.