MLG: తాడ్వాయి మండలం మేడారంలో మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా ఇవాళ పూజారులు ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం భూమి పూజ నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణ కోసం తల్లులు, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెలను ఒకే వరుసలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ను సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 23న ఆవిష్కరించారు.