MBNR: బాలనగర్ మండలంలోని చింతకుంట తండాలో బుధవారం ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా తండాలోని పలువురు వృద్ధులను సన్మానించి పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మేరా యువభారత్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాజేష్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో వృద్ధులను గౌరవప్రదంగా చూసుకుంటూ.. వాళ్లకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలన్నారు. వృద్ధులకు సేవ చేసి రుణం తీర్చుకోవాలన్నారు.