RR: నందిగామ మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఒక్క స్థానం కూడా ఎస్టీలకు రిజర్వ్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీలను మోసం చేసిందని LHPS నాయకులు శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నందిగామ, రంగాపూర్, మేకగూడ, చేగూరు గ్రామాల్లో 9 గిరిజన తండాలు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎంపీటీసీ రిజర్వు చేయకుండా తీవ్ర వివక్ష చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.