ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న EVM గోదాంను సోమవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రే తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు EVM, వీవీప్యాట్ గోదాం తనిఖీచేసి నివేదికను పంపిస్తున్నామన్నారు. EVMల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరాతీశారు. పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.