WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని శివనగర్లో సోమవారం బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలాల్లోని విద్యను విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. మంచి విద్య, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతుల లాంటి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి శ్రీనివాస్, మెరుగు ఆశోక్, శివ తదితరులున్నారు.