MNCL: కార్మికులకు అవసరమైన సరిపడా ఔషధాల సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట AITUC ఆధ్వర్యంలో నాయకులు సోమవారం ధర్నా చేశారు. అనంతరం ఏరియా ఆసుపత్రి DY.CMO ఎం.మధు కుమార్కి వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ.. గత 2 నెలలుగా పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.