PDPL: యువత క్రమశిక్షణతో లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో జరుగుతున్న అగ్నివీర్ శిక్షణ కేంద్రం ముగింపులో ఆయన పాల్గొని మాట్లాడారు. అగ్నివీర్ పరీక్షలకు సిద్ధమయ్యే యువకులకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణను ఇవ్వడం అభినందనీయమన్నారు.