స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ప్రయోగంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. రేపు మరో ముగ్గురితో కలిసి ఐఎస్ఎస్కు శుభాంశు శుక్లా పయనం అవుతారని తెలిపారు. భారత అంతరిక్ష సామర్థ్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష సంస్కరణలు చేపట్టిందని పేర్కొన్నారు. భారత అంతరిక్షయానంపై మరింత నమ్మకం పెరుగుతుందన్నారు.