SRPT: ప్రజావాణి సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన పలువురి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 64 వినతులు వచ్చాయని అన్నారు.