HNK: భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్లో ఈనెల 5వ తేదిన కోల సుమలత అనే వివాహిత మహిళను హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. మహిళను గొడ్డలితో నరికి చంపిన గుళ్ల రాజును సోమవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కోర్టు కేసులో సాక్ష్యం చెప్పవద్దు అని రాజీ కావటం లేదనే కారణంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.