HYD: మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం నేతృత్వంలో ప్రొ. కోదండరాం, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి, త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వాటి అమలుకు త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.