SRD: తెలంగాణ సెట్విన్ ఛైర్మన్ గిరిధర్ రెడ్డి జహీరాబాద్ను సందర్శించగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయన్ని ఆదివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో గిరిధర్ రెడ్డి తీవ్ర కృషి చేసినందుకు డీసీసీ ఉపాధ్యక్షులు ముల్తాన్, సీడీసీ ఛైర్మన్ ముబీన్, మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి శాలువాతో సన్మానించారు.