MLG: జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటుండగా 8 ఏళ్ల బాలికకు విద్యుత్ షాక్ తగిలింది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన కావ్యశ్రీ స్లాబ్పై ఆడుతుండగా 11కేవీ తీగలు తగిలాయి. తీవ్ర గాయాలతో చిన్నారిని హన్మకొండ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స కోసం దాతలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.