HYD: పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి వద్ద రోగులు ఆందోళనకు దిగారు. OP సేవలు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో నిమ్స్ సిబ్బంది OP సేవలు నిలిపివేశారు. వైద్యసేవలు మినహాయించి మిగతా వాటికి సెలవు ప్రకటించాలని రోగులు కోరుతున్నారు.