KNR: సంవత్సరం క్రితం పోగొట్టుకున్న ఫోన్ను తిమ్మాపూర్ పోలీసులు సోమవారం బాధితుడికి తిరిగి అప్పగించారు. తిమ్మాపూర్ మండలం జోగుండ్లకు చెందిన జాల నర్సయ్య పోగొట్టుకున్న ఫోన్ను పోలీసులు ట్రేస్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై కదిరే శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. మొబైల్ పోగొట్టుకున్నవారు CEIR పోర్టల్లో ఫిర్యాదు చేస్తే, ఫోన్ను ట్రేస్ చేసి తిరిగి పొందడం సులభమని అన్నారు.