SRD: కంగ్టి మండల పంచాయతీ నూతన అధికారి (ఎంపీవో)గా లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం పదివి బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎంపీడీవో సత్తయ్య, పంచాయతీ కార్యదర్శులు ఆయనకు స్వాగతించి శాలువా కప్పి సత్కరించారు. ఝరాసంగం మండలంలో పనిచేసిన ఈయన కంగ్టికి బదిలీపై వచ్చారు. ఇంతకాలం MPOగా కంగ్టి కార్యదర్శి సుభాష్ ఇంఛార్జ్గా విధులు నిర్వహించారు.