NZB: సాలూర మండలం హున్స, మందర్నా, ఖాజాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ.. ఈ నెల 28న ఎడపల్లి మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ పునఃప్రారంభ సన్నాహాక సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హజరైన అభిప్రాయాలను తెలియజేయాలన్నారు.