W.G: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం దరిచేరుతుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. యోగంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం యోగపై ప్రచార భేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. రేపు అల్లూరి స్మృతి వనం వద్ద 2 వేల మందితో యోగాసనాలు జరుగుతాయని తెలిపారు.