సిద్దిపేట: అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్కు తోటి జర్నలిస్ట్లు తమ వంతుగా సహాయం అందజేశారు. సిద్దిపేటకు చెందిన రజనీకాంత్ ఓ పత్రికకు జిల్లా రిపోర్టర్గా పని చేస్తున్నాడు. గత నెల రోజుల నుంచి అనారోగ్యంతో బాధడుతున్నాడు. విషయం తెలుసుకున్న తోటి జర్నలిస్టులు రంగాధం పల్లి శ్రీనివాస్, సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో రూ.10,500 ఆర్ధిక సహాయాన్ని ఆదివారం అందజేశారు.