HYD: GHMC పరిధిలో బార్ల నిర్వహణకు వేలమంది ఆసక్తి చూపుతున్నారు. 24 బార్ల కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. వీటి కోసం 3,520 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.36.68 కోట్ల ఆదాయం లభించింది. ఈ నెల 13న డ్రా పద్ధతిలో కేటాయించనున్నారు. హైదరాబాద్లో ఎక్సైజ్ కమిషనర్ ద్వార ఈ ఎంపిక జరుగనుందని డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ తెలిపారు.