సత్యసాయి: హిందూపురం రూరల్ మండలం మిట్టమీదపల్లిలో రైతు సురేశ్కు చెందిన పాడి ఆవు ఆదివారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. రైతు సురేశ్ వివరాల మేరకు.. ఆదివారం పాడి ఆవును మేపడం కోసం గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ విద్యుత్ వైర్ తగిలి ఆవు మృతి చెందిందినట్లు తెలిపారు. తనకు ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.