SKLM: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే సింహాచలం ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్న నాయుడు వారి స్వగృహం వద్ద వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఆయన మృతి చాలా బాధాకరమన్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.