NLG: బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని చందంపేట ఎంఈవో కే. చందర్ నాయక్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలేపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎంఈవో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 6 నుంచి 19 తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీవో బాలు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.