ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి అర్జీల రూపంలో అందజేశారు. సుమారు 25కు పైగా అర్జీలు వచ్చాయని మంత్రి క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. అర్జీల పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు మంత్రి పంపారు.