MNCL: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని TPCC జాయింట్ కన్వీనర్ స్వామి అన్నారు. బుధవారం బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామ 6వ వార్డులో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న CC రోడ్డు పనులకు సర్పంచ్ సాయికిరణ్ తో కలిసి భూమిపూజ చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు పాల్గొన్నారు.