KNR: తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గోదారి శోభారాణి కాంగ్రెస్ పార్టీలో చేరగా మంగళవారం ఆమెకు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా నిధులు కేటాయిస్తున్నందునే పలువురు ప్రజాప్రతినిధులు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.