జనగామ: జిల్లా కేంద్రంలోని నెహ్రు పార్క్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వరంగల్ అర్బన్ కో-అపరేటివ్ బ్యాంకును బుధవారం ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో కలిసి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ కో-అపరేటివ్ బ్యాంకు బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా నిలువాలని కోరారు.