MDK: మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 19 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యలు స్వయంగా విని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా సంప్రదించాలని సూచించారు.