MDK: అల్లాదుర్గం మండలంలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గొల్లకుంట తండా గ్రామ సర్పంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు మాన్య నాయక్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి శివరాం నాయక్ మీద 73 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి ఘనంగా సంబురాలు చేసుకున్నారు.