BHNG: ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో బుధవారం నర్సరీ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నర్సరీలో పళ్ల మొక్కలను పెంచి రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు. మొక్కలు పెంచడం ద్వారా వర్షాలు బాగా కురవడమే కాకుండా, వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుందని అన్నారు.