‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఇవాళ్టి నుంచి ఈనెల 11 వరకు మల్టీప్లెక్స్ల్లో రూ.132, సింగిల్ స్క్రీన్లలో రూ.105 పెంపునకు అనుమతి ఇచ్చింది. 12 నుంచి 18 వరకు మల్టీప్లెక్స్ల్లో రూ.89, సింగిల్ స్క్రీన్లలో రూ.62 పెంపునకు అనుమతి ఇచ్చింది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్కు ఇవ్వాలని తెలిపింది.