మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల దేవుని గుట్టలో బుధవారం నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి TPCC ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిహర సుతుడు అయ్యప్ప స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.