NRML: ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో పరశురాం సూచించారు. తానూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2వ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షలను ఆయన పరిశీలించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ప్రణాళికతో చదవి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.