జగిత్యాల జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు మంగళవారం తహసీల్దార్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. విద్యాశాఖకు అనుబంధంగా సమగ్ర శిక్ష అభియాన్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ పే స్కేల్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఆరు నెలలు ఇవ్వాలని కోరారు.