MNCL: నస్పూర్లోని కేజీబీవీ పాఠశాల, కళాశాలలో విద్యార్థినిలకు మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 56 మందికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత, కార్పొరేటర్ పుట్ట యశోద కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కంటి వ్యాధులు రాకుండా పోషకాహారాలు, విటమిన్ ఏకు సంబంధించిన ఆహార పదార్థాలు, ఆకుకూరలు తీసుకోవాలని సూచించారు.