SRD: ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన మూడు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఉపాధి హామీ ఏపీడీకి సంగారెడ్డిలో బుధవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి కూలీలకు బకాయిలు చెల్లించకపోవడం సరికాదని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.