NLG: తల్లి మందలించిందని మనస్థాపానికి గురైన యువతి పురుగుల మందు సేవించి మృతి చెందింది. మునుగోడు ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనులకు వెళ్లాలని తల్లి మందలించగా.. మునుగోడు మండలం చెల్మెడకు చెందిన యువతి కొంక భవాని (25) పురుగుల మందు తాగింది. చికిత్స కోసం నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.