SRCL: కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా కోడె మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ పర్యవేక్షకులు బి. తిరుపతి రావు ఎమ్మెల్యే దంపతులకు శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం ఇచ్చారు. అర్చకులు వారిని ఆశీర్వదించారు.