NZB: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి మాట్లాడడం సరికాదని MLA ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. కావాలనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ ఫండ్ విషయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి సీఎంకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.