BDK: ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న తమ భూములను అటవీశాఖ అధికారులు అన్యాయంగా లాక్కుంటున్నారని ఆదివాసీ గిరిజనులు ఆరోపించారు. పట్టాలు ఉన్న భూములను స్వాధీనం చేసుకుని, కేవలం రెండెకరాలు మాత్రమే ఇస్తామనడం సరికాదని ధ్వజమెత్తారు. తమ భూమి తమకు కావాలని కోరినందుకు అధికారులు దాడులకు తెగబడ్డారని బాధితులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.